AP News:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగ నియామకాలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

by Jakkula Mamatha |
AP News:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగ నియామకాలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి కొనసాగుతున్నాయి. కాగా నేటితో (శుక్రవారం) ఈ సమావేశాలు ముగియనున్నాయి. అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారనే సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయుల నియామక అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని..రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మరిన్ని ఇన్సెంటివ్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తామని అసెంబ్లీలో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed