- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మట్టి గణపతులను పూజిద్దాం..ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
దిశ ప్రతినిధి,నంద్యాల సిటీ:నంద్యాల పట్టణంలోని స్థానిక పార్క్ రోడ్డులో గల బాల అకాడమీ మరియు రవీంద్ర విద్యాసంస్థల అధినేత రవీంద్ర, మాధవిలత ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ..వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని, ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు వినాయకుని పూజిస్తారని కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే వాడాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి, పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.