- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీసుల విచారణలోనే పోసాని.. లాయర్ పొన్నవోలు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి పోలీసుల విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan), నారా లోకేశ్(Nara Lokesh)ను దూషించిన కేసులో బుధవారం హైదరాబాద్(Hyderabad)లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి(Obulavaripalli)కి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పోసాని తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Lawyer Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించనున్నారు.
ఓబులవారిపల్లి నుంచి పొన్నవోలు మాట్లాడుతూ వైఎస్ జగన్(Ys Jagan)ను, ఆయన కుటుంబాన్ని దూషించినప్పుడు కూటమి నేతలకు కనబడలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఈ కేసులో పోసానికి బెయిల్ రావాలనే కోరుకుంటున్నానన్నారు. పోసానిని తాను ఇంకా ప్రత్యక్షంగా కలవలేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పోసాని తరపున వాదనలు వినిపించాలని జగన్ ఆదేశించారని తెలిపారు. కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం వాదనలు వినిపించాలని జగన్ సూచించారని చెప్పారు. పోసాని తప్పు చేశాడా..? లేదా అనేది కోర్టు తేల్చుతుందన్నారు. పోసాని తరపున బెయిల్ కోసం ప్రయత్నం చేస్తామని తెలిపారు. పోసాని కోసం దూరం అయినా హైదరాబాద్ నుంచి ఓబులవారి పల్లికి వచ్చానని పొన్నవోలు పేర్కొన్నారు.