అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

by Jakkula Mamatha |
అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
X

దిశ ప్రతినిధి,కృష్ణాజిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేడు(ఆదివారం) మోపిదేవి వార్పు వద్ద ఈ ప్రమాదం వెలుగుచూసింది. ఈ క్రమంలో మోపిదేవి వార్పు వద్ద అవనిగడ్డ వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ప్రమాదానికి గురైన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story