జైల్లో వ్యక్తులను చంపడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు

by Seetharam |
జైల్లో వ్యక్తులను చంపడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సెంట్రల్ జైలులో తన భద్రత, ఆరోగ్యానికి ముప్పు ఉందని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ సైతం రాసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు భద్రతపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అని ఆరోపించారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారు.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అని ఆరోపించారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా.. విచారణ లేదన్నారు. చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదని మండిపడ్డారు. జైలు లోపల నుంచి ఫొటోలు వస్తున్నా ఎలాంటి చర్యల్లేవు అని మండిపడ్డారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ప్రభుత్వానికేం సంబంధం అని వైసీపీ అబద్దాలు ఆడుతుందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో మొత్తం వ్యవహరం నడుస్తుండడం కూడా తమకు మరింత ఆందోళన కలుగుతోంది అని అచ్చెన్నాయుడు అన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశ్యాలు బయట పడుతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు చాలా వరకు బరువు తగ్గారు అని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed