ఆధారాలుంటే కేసులు పెట్టండి: పత్రాల దగ్ధంపై స్పందించిన అంబటి

by srinivas |
ఆధారాలుంటే కేసులు పెట్టండి: పత్రాల దగ్ధంపై స్పందించిన అంబటి
X

దిశ, వెబ్ డెస్క్: ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం పత్రాలు దగ్ధం ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గత ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలే పత్రాలు దగ్ధం చేస్తున్నారన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. పత్రాలు దగ్ధం అయితే ఆధారాలు ఉండవా అని ప్రశ్నించారు. పత్రాలన్నీ డిజిటలైజేషన్ జరిగాయన్నారు. మదనపల్లె సబ్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయితే మంత్రి పెద్దిరెడ్డి తగులబెట్టించారని కొందరు నేతలు ప్రచారం చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పత్రాలు ఒక్క చోటే ఉంటాయా అని ప్రశ్నించారు. ఫైళ్ల దగ్ధంపై ఆధారాలు ఉంటే కేసులు పెట్టాలని సూచించారు. అబద్ధాలను నమ్మించే ప్రయత్నాలు ఎంతకాలం చేస్తారని మాజీ మంత్రి అంబటి నిలదీశారు.

Next Story

Most Viewed

    null