2024లో టీడీపీ అభివృద్ధికి, వైసీపీ అవినీతికి మ‌ధ్య పోటీ: మాజీమంత్రి నారాయణ

by Seetharam |
2024లో టీడీపీ అభివృద్ధికి, వైసీపీ అవినీతికి మ‌ధ్య పోటీ: మాజీమంత్రి నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024లో టీడీపీ అభివృద్ధికి, వైసీపీ అవినీతికి మ‌ధ్య పోటీ అని మాజీమంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు న‌గ‌రంలోని 49వ డివిజ‌న్‌లో మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ ఓట‌రు జాబితాను చేత‌ప‌ట్టి క్షేత్ర‌స్థాయిలో డివిజ‌న్‌లోని ప్ర‌తి ఇంటికి వెళ్లి వెరిఫికేష‌న్ చేశారు. డివిజ‌న్‌లో త‌మ ఇళ్ల వ‌ద్ద‌కు వ‌చ్చిన మాజీ మంత్రి నారాయ‌ణ‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిల‌కు ప్రజలు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం మాజీ మంత్రి నారాయ‌ణ డివిజ‌న్‌లోని ప్ర‌తి ఇంటికి వెళ్లి ఓట‌ర్ జాబితా ప్ర‌కారం వారి పేర్లు ఉన్నాయా? లేదా అని ప‌రిశీలించారు. నూత‌న ఓట‌రు న‌మోదు, మ‌ర‌ణించిన లేదా వేరే ప్రాంతాల‌కు వెళ్లిన వారి వివ‌రాలు సేక‌రించి ఆయా కుటుంబ‌స‌భ్యుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. 2024లో టీడీపీ అభివృద్ధికి, వైసీపీ అవినీతికి జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ విలువైన ఓటుహ‌క్కును వినియోగించుకోవాల‌ని మాజీమంత్రి పొంగూరు నారాయణ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, రేవతి,ఖాదర్ బాషా,బండి ప్రసాద్ తదితర ముఖ్య నేతలు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed