మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు సమావేశం

by Mahesh |   ( Updated:2024-10-15 09:01:07.0  )
మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేలతో సమావేశం అయిన చంద్రబాబు వారికి పలు అంశాలపై క్లాసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని..ఎమ్మెల్యేలకు మరోసారి స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే మద్యం షాపు యజమానులను బెదిరించిన.. పలువురు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే త్వరలో రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించి, ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. అలాగే దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed