- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TTD:తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పై శ్రీవారి దర్శనం.. ఆ రోజు నుంచే అమలు!

దిశ, తిరుమల: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం సోమవారం(మార్చి 24) నుంచి అమలులోకి రానుంది. ఇందులో భాగంగా రేపు(ఆదివారం) సిఫార్సు లేఖలు స్వీకరించడం జరుగుతుంది. అయితే ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా ఈనెల 30వ తారీఖున శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 25న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. ఈ కారణంగా మార్చి 25వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనం కొరకు మార్చి 24వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని భక్తుల స్పష్టత కొరకు మరోసారి తెలియజేయడమైనది.
అదేవిధంగా ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం(ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించబడతాయని కూడా టీటీడీ గతంలోనే స్పష్టం చేసింది. అయితే మార్చి 30న ఆదివారం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మార్చి 29వ తారీఖున శనివారం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని మరోసారి టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టిటిడికి సహకరించవలసినదిగా కోరడమైనది.