తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు..

by Disha Web Desk 18 |
తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు..
X

దిశ, తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం వేకువజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఐఏఎస్, తెలంగాణ మాజీ హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి,టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Next Story

Most Viewed