ఢిల్లీలో చంద్రబాబు..రెండు రోజులపాటు అక్కడే

by Seetharam |
ఢిల్లీలో చంద్రబాబు..రెండు రోజులపాటు అక్కడే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తిన చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నాం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఢీల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడులు ఘన స్వాగతం పలికారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు ఢిల్లీ ఉండనున్నారు. ఈనెల 27న చంద్రబాబు నాయుడు తరఫున ఆయన కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడు వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇకపోతే ఈనెల 28న కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో త్వరలోనే ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

Advertisement

Next Story