- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Tragic incident:‘కన్నా లేవరా ఇంటికి పోదాం’.. గుండెల్ని పిండేసే విషాద ఘటన
దిశ,వెబ్డెస్క్: ‘కన్నా.. ఎంతసేపు నిద్రపోతావ్.. త్వరగా లేవరా ఇంటికి వెళ్ళిపోదాం. వినిపిస్తోందా.. లేరా కన్నయ్య! అందరూ చూస్తున్నారు రా.. నువ్వు త్వరగా నిద్ర లేస్తే అంతా కలిసి ఇంటికి వెళ్ళిపోదాం’ అంటూ ఓ తల్లి తన బిడ్డతో చెబుతున్న మాటలు ప్రస్తుతం అందరి మనసులను కలిచివేస్తోంది. ఎందుకంటే ఆ బిడ్డ చనిపోయాడు. కానీ ఆ తల్లి హృదయం తన బిడ్డ కానరాని లోకాలకు వెళ్లాడంటే నమ్మలేకపోతుంది. అందుకే అలా ఆసుపత్రి బెడ్పై ఉన్న తన కొడుకు పక్కన పడుకుని అతను నిద్రపోతున్నాడు అనుకొని జోకొడుతుంది. ఆ తల్లి తన బిడ్డ తనను అమ్మా అని పిలుస్తాడని.. తన దగ్గరకు తిరిగి వస్తాడని భ్రమతో ఓ వైపు కన్నీరు పెడుతూనే మరోవైపు కుమారుడి మృతదేహంతో మాట్లాడుతుంది. అయితే ఈ హృదయ విదారక ఘటన చూసిన అక్కడి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కన్నపేగు బాధను చూసి తట్టుకోలేకపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడుకు చెందిన బాబు రామ్, శిరీష దంపతులు ఇద్దరు కుమారులతో ఆనందంగా, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న కుమారుడు(3) ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పిల్లలిద్దరితో కలిసి బైక్పై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ హస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బైక్ అదుపు తప్పి అందరూ కింద పడిపోయారు. దీంతో ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్(5) ఎగిరి రోడ్డుపై పడడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.