Breaking: ఏపీలో ఆ రోజే ఎన్నికలు.. ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?

by srinivas |
Breaking: ఏపీలో ఆ రోజే ఎన్నికలు.. ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల నగరా మోగింది. మే13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వడ్ లోకసభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 2 కోట్ల మంది కాగా..మహిళలు 2 కోట్ల 7 లక్షల మంది ఉన్నారు. థర్ జెండర్ ఓటర్లు 3482 మంది ఉండగా 67,434 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఎన్ఆర్ఐలు 7 వేల 603 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 46,165 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. ఎన్నికల నగరా మోగినప్పటి నుంచే రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనలు కఠిన చర్యలు తప్పవని సీఈసీ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed