దాడి చేయటం తప్పే.. కానీ, దానికి కారణం ఎవరు? అంటూ తప్పును ఒప్పుకున్న సజ్జల

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. బూతులు మాట్లాడే హక్కు కోసం చంద్రబాబు దీక్షలు చేస్తున్నాడని విమర్శించారు. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి కుసంస్కార మాటలపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా […]

Update: 2021-10-21 03:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. బూతులు మాట్లాడే హక్కు కోసం చంద్రబాబు దీక్షలు చేస్తున్నాడని విమర్శించారు. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి కుసంస్కార మాటలపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అని స్పష్టం చేశారు. త్వరలో తాము కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం అన్నారు. సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యాఖ్యలు చేయించినందుకు చంద్రబాబు..పట్టాభిలు వైఎస్ జగన్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News