Road Accident: యూఎస్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం!
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలో (America)లోని టెక్సాస్ రాష్ట్రం (Texas State) అన్నా రోడ్ నెం.79లో శుక్రవారం చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలో (America)లోని టెక్సాస్ రాష్ట్రం (Texas State) అన్నా రోడ్ నెం.79లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కార్ పూలింగ్ యాప్ ద్వారా ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ కలిసి బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఓ కారులో బయలుదేరారు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వరుసగా ఎదురుగా ఉన్న ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారుకు మంటలు అంటుకోవడంతో వారు అందులోంచి బయటకు రాలేక కాలి బూడిదయ్యారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉండటంతో కార్ పూలింగ్ యాప్లో ఇచ్చిన వివరాల మేరకు వాళ్లు ఎవరనే అంచనాకు పోలీసులు వచ్చారు. మృతుల్లో ముగ్గురు హైదరాబాదీలు కాగా.. ఒకరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.