వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు వివేక్ రామస్వామికి నిరసన సెగ ఎదురైంది. అమెరికా అధ్యక్షుడినైతే ఉక్రెయిన్కు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తానని అన్నందుకు.. కొందరు ఉక్రెయిన్ మద్దతుదారులు ఆయన కాన్వాయ్లోని వాహనంపై దాడికి యత్నించారు. అయోవా రాష్ట్రంలోని గ్రిన్నెల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వివేక్ ఆరోపణలపై ఆగ్రహంతోనే ఈ దాడి జరిగిందనేందుకు ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వివేక్ రామస్వామి ట్వీట్ చేశారు. ‘‘ఇద్దరు నిరసకారులు నాతో వాగ్వాదానికి దిగారు. వాళ్లకు నేను ఓపిగ్గా సమాధానాలిచ్చాను. కానీ వారిలో ఇద్దరు నీలి రంగు హోండా సివిక్ కారుతో నా కాన్వాయ్లోని ఎస్యూవీని ఢీకొట్టారు. మా సిబ్బందికి అసభ్య సంజ్ఞలు చేశారు. కారుతో ఢీ కొట్టిన వాళ్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు’’ అని ట్వీట్లో వివేక్ రామస్వామి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అభిప్రాయాలను తెలిపే హక్కు ఉంటుందని, అందుకు ఇది సరైన విధానం కాదని మరో ట్వీట్లో ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరని, తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.