పాక్‌కు న‌వాజ్ ష‌రీఫ్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం!

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్‌ ఈనెల 21న ప్రత్యేక చార్టెర్డ్ విమానంలో పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చేరుకుంటార‌ని తెలుస్తోంది.

Update: 2023-10-11 10:54 GMT

ఇస్లామాబాద్ : ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్‌ ఈనెల 21న ప్రత్యేక చార్టెర్డ్ విమానంలో పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చేరుకుంటార‌ని తెలుస్తోంది. ‘‘ష‌రీఫ్ పాక్‌కు వచ్చే విమానం పేరు ‘ఉమీద్- ఏ- పాకిస్తాన్’. ఇందులోని 150 సీట్ల టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి’’ అని పేర్కొంటూ పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. లాహోర్‌కు చేరుకోగానే నగరంలోని ‘మినార్-ఏ-పాకిస్తాన్’ వ‌ద్ద ప్రజ‌ల‌ను ఉద్దేశించి న‌వాజ్ ష‌రీఫ్‌ ప్రసంగించ‌నున్నారు.

ఈ స‌మావేశానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ న‌వాజ్ (పీఎంఎల్ -ఎన్) పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు భారీ సంఖ్యలో హాజ‌రు కానున్నారు. ఇక ఈరోజు నుంచి వారం రోజుల పాటు న‌వాజ్ ష‌రీఫ్ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. తిరిగి అక్టోబ‌ర్ 18న దుబాయ్‌కు చేరుకొని, 21న పాకిస్తాన్‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. మూడు సార్లు పాక్ ప్రధానిగా సేవ‌లందించిన న‌వాజ్ ష‌రీఫ్‌.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జ‌ర‌గ‌బోయే పాక్ ఎన్నికల్లో పోటీ చేయ‌నున్నారు.


Similar News