అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారత్ కు చెందిన ముగ్గురు మృతి..!

అమెరికాలోని టెక్సాస్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-08-16 19:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టెక్సాస్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తల్లితండ్రులు తమ కొడుకుని డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి డ్రాప్‌ చేయడానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన దంపతులు అరవింద్ మణి, అతని భార్య ప్రదీపా అరవింద్ అలాగే కుమారుడు ఆండ్రిల్ అరవింద్ మృతి చెందారు.వీరు ముగ్గురు టెక్సాస్ విశ్వవిద్యాలయానికి కారులో వెళ్తుండగా కారు టైర్ పేలిపోయింది. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మరో కారుని ఢీకొంది.ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే స్పాట్ లో చనిపోయారు. కాగా అరవింద్ మణి, ప్రదీప దంపతులకు ఆదిర్యాన్ అరవింద్ అనే చిన్న కుమారుడు ఉన్నాడు.కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో ఆదిర్యాన్ ఒంటరి వాడైపోయాడు. 


Similar News