అన్నదాతకు అండగా ఉంటాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

దిశ, చెన్నూరు: భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నష్టపోయిన రైతుల పంటలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని రైతులు ఎటువంటి ఆలోచన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే […]

Update: 2021-07-28 05:44 GMT

దిశ, చెన్నూరు: భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నష్టపోయిన రైతుల పంటలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని రైతులు ఎటువంటి ఆలోచన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, కలెక్టర్ భారతి హోళీ కేరి, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ నెంబర్లు, సర్పంచులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News