విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై విచారణ వాయిదా..

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అలాగే, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీనారాయణ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని పిటిషన్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో […]

Update: 2021-09-08 06:41 GMT

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అలాగే, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీనారాయణ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని పిటిషన్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News