ఇద్దరు యువకులను బలిగొన్న కంటైనర్..

దిశ, శంకర్ పల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కథనం ప్రకారం.. షాబాద్ మండలం కక్కులూరు గ్రామానికి చెందిన బేగరి ప్రవీణ్ (18) బేగరి విక్రాంత్ (19) నిన్న రాత్రి 10 గంటల సమయంలో షాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై సర్దార్ నగర్ వైపు వెళుతున్నారు. సర్దార్ నగర్ వద్ద రోడ్డు పక్కన బైకు ఆపి నిలబడి […]

Update: 2021-09-09 07:37 GMT

దిశ, శంకర్ పల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కథనం ప్రకారం.. షాబాద్ మండలం కక్కులూరు గ్రామానికి చెందిన బేగరి ప్రవీణ్ (18) బేగరి విక్రాంత్ (19) నిన్న రాత్రి 10 గంటల సమయంలో షాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై సర్దార్ నగర్ వైపు వెళుతున్నారు. సర్దార్ నగర్ వద్ద రోడ్డు పక్కన బైకు ఆపి నిలబడి ఉన్నారు.

వెనక నుంచి అతివేగంగా వస్తున్న కంటైనర్ వాహనం రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు యువకులను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి షాబాద్ పోలీసులు చేరుకుని క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించి మృతి చెందిన యువకులను బయటికి తీశారు. మృతదేహాలను షాద్ నగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపారు.

Tags:    

Similar News