Viral Video: హైవేపై రీల్స్ చేస్తూ బైక్ రైడింగ్.. వేగంగా వచ్చి ఢీ కొట్టిన కారు

హైవేపై రీల్స్ చేస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను కారు ఢీ కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

Update: 2024-08-15 12:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైవేపై రీల్స్ చేస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను కారు ఢీ కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిజ్‌నూర్ ప్రాంతంలోని ముంధాల గ్రామానికి చెందిన సమర్, నోమన్ అనే యువకులు సమీపంలోని 34వ జాతీయ రహదారిపై బైక్ పై వెళుతున్నారు. వీరిద్దరు హైవేపై రైడింగ్ చేస్తున్నట్లు బైక్ ను అటు ఇటు తిప్పుతూ రీల్స్ లో నటిస్తున్నారు. దీనిని మరో వ్యక్తి వేరే బైక్ పై ఉండి వీడియో తీస్తున్నాడు. ఇంతలో హైవేపై వేగంగా వచ్చిన కారు బైక్ రైడింగ్ చేస్తున్న యువకులను ఢీ కొట్టింది. దీంతో ఒక్క సారిగా ఆ యువకులు గాళ్లో ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా.. కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి సరదాలు వేరే వారికి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News