Viral Video: హమ్ దో.. హమారా దో డజన్.. 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ప్రస్తుతం ఉన్న సమాజంలో దంపతులు 'మేమిద్దం మాకిద్దరు' అన్నట్లు సర్ధుకుపోతున్నారు.

Update: 2024-09-25 09:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఉన్న సమాజంలో దంపతులు 'మేమిద్దం మాకిద్దరు' అన్నట్లు సర్ధుకుపోతున్నారు. కొందరు ఆ ఇద్దరిని కూడా పెంచడం కష్టం అని భావించి 'మేమిద్దం మాకు ఒక్కరు' అన్నట్లుగా పిల్లల్ని కంటున్నారు. కానీ ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఓ మహిళ హమ్ దో.. హామారా దో డజన్ అంటూ ఏకంగా 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఖుష్బు పాఠక్ అనే మహిళ 16 మంది ఆడపిల్లలకు 8 మంది మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఓ మీడియా చానెల్ కు ఆమె ఇచ్చిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. అంతమంది పిల్లలు కలిగిన తాను భాగ్యలక్ష్మిని అని చెప్పింది.

అంతేగాక దేవుడు ఇస్తున్నాడు నేను తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో ఈ పిల్లల పేర్లను వన్, టూ, థ్రీ, ఫోర్ అని నంబర్లతో పిలుస్తామని, ఆధార్ కార్డులలో మాత్రం వేరే పేర్లు ఉన్నాయని తెలిపింది. వీరిలో 17 మంది స్కూల్ కి పోతున్నారని, మిగిలిన వారు ఇంటి దగ్గరే ఉంటారని చెప్పింది. ఇక తన భర్త సాధారణ టాక్సీ డ్రైవర్ అని, అందులో వచ్చిన డబ్బుతోనే పిల్లలను పోషిస్తున్నామని ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అందరూ ఆమెను స్పూర్తిగా తీసుకొని దేశ జనాబాను పెంచాలని, పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తున్న చైనా ఈమెను బ్రాండ్ అంబాసిడర్ చేయాలని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Similar News