Trending: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్

సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదనే విషయం ఆలోచించకుండా నేటి యువత అకాణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Update: 2024-08-17 03:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదనే విషయం ఆలోచించకుండా నేటి యువత అకాణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యంతో ఎదిగి తల్లిదండ్రులకు పేరు పత్రిష్టలు తీసుకురావాల్సిన నవతరం క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోతను మిగిల్చి లోకం నుంచి నిష్క్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న యువతిని ఓ క్యాబ్ డ్రైవర్ చూశాడు. దీంతో అతడు ఆ యువతిని నీళ్లలోకి దూకొద్దని గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ డ్రైవర్‌తో కలిసి యువతిని సురక్షింగా బయటకు తీసుకొచ్చారు. అయితే, అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News