Trending: స్వాతంత్య్ర దినోత్సవం రోజున అద్భుతం చేసిన పక్షి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేరళ రాష్ట్రంలో అద్భుతం చోటుచేసుకుంది.

Update: 2024-08-17 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేరళ రాష్ట్రంలో అద్భుతం చోటుచేసుకుంది. ఏకంగా ఓ పక్షి రెప్పపాటులో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, కొందరు ఓ గ్రామంలో జాతీయ జెండాను ఎగురు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జాతీయ జెండా పోల్ చివరి భాగంలో ఇరుక్కుపోయింది. అయితే, అనూహ్యంగా ఎక్కడి నుంచో వచ్చిన పక్షి ఇరుక్కుపోయిన జెండాను గాలిలోకి ఎగిరేలా చేసింది. అయితే, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జెండా ఇరుక్కుపోవడం ఏంటి.. పక్షి వచ్చి ఎగరవేయడం ఏంటని అక్కడనున్న జనం ఇది అద్భుతమే అంటూ ఫీల్ అవుతున్నారు. 

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి:  https://x.com/RVCJ_FB/status/1824626190625456534

Tags:    

Similar News