తన పెళ్లినే మర్చిపోయి మండపానికి వెళ్లని వ్యక్తి.. కారణం ఏంటంటే..?

మందు బాబుల గురించి అందరికి తెలిసిందే. వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

Update: 2023-03-17 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: మందు బాబుల గురించి అందరికి తెలిసిందే. వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వారు చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఫుల్‌గా మద్యం సేవించి ఏం చేస్తున్నామ్, ఎక్కడ ఉన్నామ్ అనే విషయాలు కూడా మర్చిపోయి ఉన్నచోటనే పడుకుండిపోతారు. తాజాగా ఇలాంటి సంఘటనే బిహార్‌లో జరిగింది. ఫుల్ తాగిన వ్యక్తి తన పెళ్లినే మర్చిపోయి మండపాని వెళ్లడం మానేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

భాగల్‌పూర్‌లో నివాసం ఉండే మియాన్ అనే యువకుడికి, సుల్తాన్‌పూర్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమయింది. అయితే పెళ్లి రోజున మండపానికి వధువు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఎంత సమయం అయిన వరుడు మాత్రం మండపానికి రాలేదు. దీంతో బంధువులు కంగారు పడి తల ఓ చోట వెతకడం ప్రారంభించారు. వరుడు మాత్రం ఫుల్‌గా మద్యం సేవించి మండపానికి వచ్చాడు. అది చూసిన వధువు పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది.

Tags:    

Similar News