Meerut : అబ్బాయిలు కనిపిస్తే వదలడు! 30 మందితో లైంగిక సంబంధం.. వ్యక్తి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 30 మందికి పైగా అబ్బాయిలను వేధించిన సంచలన కేసు వెలుగులోకి వచ్చింది.

Update: 2024-08-27 09:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 30 మందికి పైగా అబ్బాయిలను వేధించిన సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు గ్రామంలోని అబ్బాయిలు కనిపిస్తే వారిని ప్రలోభపెట్టి తన ఇంటికి పిలిపించుకునేవాడు. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని, ఆ సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడని తాజాగా ఆ వ్యక్తిని మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత్ చౌహాన్ అనే వ్యక్తి తన గ్రామానికి చెందిన 30 మందికి పైగా బాలురతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు 6 మంది బాధితులు పోలీసుల ముందుకొచ్చారు. ఇందులో 5 మంది మైనర్లు ఉన్నారు.

నిందితుడు అజిత్ చౌహాన్ ఓ ప్రైవేట్ రూమ్‌లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ అశ్లీల దృశ్యాలు రికార్డ్ చేసేవాడని తర్వాత బ్లాక్ మెయిల్‌కు దిగేవాడని ముందుకు వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు బ్లాక్ మెయిల్ చేసి లక్షలు వసూలు చేశాడని తెలిపారు. అయితే డబ్బులు ఇవ్వడం మానేయడంతో నిందితుడు ఓ మైనర్ బాలుడి వీడియోను సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసి పారిపోయాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అబ్బాయిలపై అత్యాచారం చేశాడని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 


Similar News