Breaking News: వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు.. దెబ్బకు ఇంస్టాగ్రామ్ నిషేధం

సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేసింది.

Update: 2024-08-02 12:20 GMT

దిశ, ఫీచర్స్: ఖాళీ సమయం దొరికితే చాలు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ ని అదే పనిగా చూస్తూ కాల క్షేపం చేస్తున్నారు. మన ఫోన్ లో నెట్ వర్క్ అయిపోతే అప్డేట్స్ ఏమీ తెలియవు. మళ్ళీ మనం రీఛార్జ్ చేసి నెట్ ఆన్ చేస్తే తప్ప దేశంలో ఏమి జరుగుతున్నాయో కూడా తెలియవు. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనే ఎక్కువగా తెలుస్తాయి. అయితే, తాజాగా టర్కీ దేశం ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించింది.

సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేసింది. అయితే, ఇంత సడెన్ గా ఎందుకు నిషేధించారో కారణాల గురించి చెప్పలేదు. అక్కడ ఇది ఎంత కాలం అమలులో ఉంటుందో కూడా ఒక స్పష్టత కూడా లేదు.

ఇటీవల హమాస్ చీఫ్‌పై సంతాప సందేశాన్ని తొలగించినందుకు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌ను సీనియర్ టర్కిష్ అధికారి విమర్శించారు. ‘ఇది పూర్తి సెన్సార్‌షిప్’ అంటూ టర్కిష్ ప్రెసిడెన్షియల్ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. టర్కీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ అథారిటీ దీని గురించి వారి వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసారు. ఈ నిషేధం గురించి మెటా ఇంకా స్పందించకపోవడం విశేషం.

Tags:    

Similar News