ట్రాక్టర్ ఆటో ఢీ…ఒకరు మృతి

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం తమ్మర బ్రిడ్జి వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లో కెళితే… ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మనురాసిపల్లి గ్రామానికి చెందిన మేడ వెంకటేశ్వర్లు (48)అనే వ్యక్తి కూలి పనికి కోదాడ కు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి ఆటోలో ప్రయాణమయ్యాడు. కోదాడ తమ్మర బ్రిడ్జి వద్ద ఆ ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. […]

Update: 2020-10-05 09:47 GMT

దిశ, వెబ్ డెస్క్:
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం తమ్మర బ్రిడ్జి వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లో కెళితే… ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మనురాసిపల్లి గ్రామానికి చెందిన మేడ వెంకటేశ్వర్లు (48)అనే వ్యక్తి కూలి పనికి కోదాడ కు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి ఆటోలో ప్రయాణమయ్యాడు. కోదాడ తమ్మర బ్రిడ్జి వద్ద ఆ ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News