కార్పొరేటర్‌ కావాలని ఉందా?

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల కోసం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. త్వరలో ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడనున్నందున తొందరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులను భర్తీ చేసి గాంధీ భవన్‌లో ఇవ్వాల్సిందిగా ప్రకటించారు. ఇందుకోసం నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తులు గాంధీ భవన్‌లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకూ ఎన్నికల్లో […]

Update: 2020-11-13 10:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల కోసం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. త్వరలో ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడనున్నందున తొందరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులను భర్తీ చేసి గాంధీ భవన్‌లో ఇవ్వాల్సిందిగా ప్రకటించారు.

ఇందుకోసం నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తులు గాంధీ భవన్‌లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకూ ఎన్నికల్లో అభ్యర్థి పేర్లను ప్రకటించడానికి, నామినేషన్ల గడువు ముగిసే చివరిరోజు వరకూ ఎదురుచూసే ఉత్తమ్ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీలకంటే ముందుగానే దరఖాస్తులను ఆహ్వానించడం విశేషం.

Tags:    

Similar News