13లక్షల కేసులను దాటేసిన భారత్

దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల్లో రోజుకో గరిష్ట సంఖ్య నమోదవుతోంది. తాజాగా 24 గంటల్లో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య 50వేలకు అతి చేరువలో నమోదైంది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 49,310 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి రోజులో నమోదైన కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో రెండు రోజుల్లోనే 95 వేలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లయింది. […]

Update: 2020-07-24 12:03 GMT

దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల్లో రోజుకో గరిష్ట సంఖ్య నమోదవుతోంది. తాజాగా 24 గంటల్లో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య 50వేలకు అతి చేరువలో నమోదైంది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 49,310 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి రోజులో నమోదైన కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో రెండు రోజుల్లోనే 95 వేలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లయింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 12,87,945కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వివిధ రాష్ట్రాల కేసుల బుల్లెటిన్‌లు వెలువడటంతో ఈ సంఖ్య 13 లక్షలు దాటింది.

వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 740 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 30,601కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల్లో భారత్ ఫ్రాన్స్‌ను దాటి ఆరోస్థానానికి చేరింది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 8,17,209 మంది కోలుకోగా ప్రస్తుతం 4,40,135 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం గడిచిన కొద్ది రోజులుగా కొత్త కేసుల నమోదు స్థిరంగా తగ్గుముఖం పడుతోంది.

ఒక్కరోజులో నమోదైన 1025 పాజిటివ్ కేసులతో కలిపి ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,28,389కు చేరింది. ఇక్కడ కొత్తగా 32 కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3777 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులో 9615 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,57,117కు వెళ్లింది. రాష్ట్రంలో 24 గంటల్లో వైరస్ బారినపడి 278 మంది చనిపోగా మొత్తం మరణాలు 13,132కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 6785 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,99,749కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 88 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3320కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8147 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,858కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 49 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకి 933 మంది మృత్యువాత పడ్డారు.

Tags:    

Similar News