దారుణం.. మట్టిపెల్లలు పడి ముగ్గురు కూలీల మృతి

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా రక్కసి వలన ఓ వైపు జనాలు పిట్టల్లా రాలుతుంటే, మరోవైపు ప్రమాదాల బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలోనూ ప్రమాదాలు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా మట్టిపెల్లలు కూలిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సూరజ్‌పూర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బోరుబావిలో పూడిక తీస్తుండగా […]

Update: 2021-05-30 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా రక్కసి వలన ఓ వైపు జనాలు పిట్టల్లా రాలుతుంటే, మరోవైపు ప్రమాదాల బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలోనూ ప్రమాదాలు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా మట్టిపెల్లలు కూలిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు.

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సూరజ్‌పూర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బోరుబావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News