దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ప్రకారం… దేశంలో 45,209 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. ఇందులో 85,21,617 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా వైరస్ బారినపడి 501 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం […]

Update: 2020-11-21 23:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ప్రకారం… దేశంలో 45,209 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. ఇందులో 85,21,617 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా వైరస్ బారినపడి 501 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కి పెరిగింది.

Tags:    

Similar News