ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

దిశ, రాజేంద్రనగర్: ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డుపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం… శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్దకు రాగానే […]

Update: 2020-10-08 21:59 GMT

దిశ, రాజేంద్రనగర్: ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డుపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం… శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్దకు రాగానే రాంగ్ రూట్‌లో ఎయిర్‌పోర్టు నుంచి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో కారులో ఉన్న విశ్వనాథ్ (23), ప్రదీప్ (25)లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరు ఆరుగురికి తీవ్రగాయాలు ఇందులో మహ్మద్ అలీ, సంపత్‌ల పరిస్థితి విషయంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేట, హయత్‌నగర్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Tags:    

Similar News