పింక్ కలర్ శారీలో మెరిసిపోతున్న యంగ్ బ్యూటీ.. పక్కా కోహినూర్ డైమండ్ అంటున్న నెటిజన్లు

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-18 05:57 GMT

దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మందిని కట్టిపడేసింది. అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అదే విధంగా డీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ రీసెంట్‌గా వచ్చిన ‘అరుణ్మణై4’ మూవీలో నటించి మెప్పించింది. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ భామ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా రాశీ ఖన్నా ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ శారీ కట్టుకొని వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు పక్కా కోహినూర్ డైమండ్ అని, గార్జియస్ అని, సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to raasii khanna instagram id)

Tags:    

Similar News