Prabhas : ఒకేసారి నాలుగు సినిమాల రీ రిలీజ్ లు ఎందుకు.. మేకర్స్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

మేకర్స్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

Update: 2024-10-16 04:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, ఈ స్టార్ హీరో భారీ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయడం లేదు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ లు ట్రెండ్ నడుస్తుంది. డబ్బుల కోసమే ఈ రీ రిలీజ్ లు చేస్తున్నామని కొందరూ ఓపెన్ గానే చెబుతున్నారు. ఫ్యాన్స్ కూడా వీటిని ఎంజాయ్ చేయడంతో దొరికిందే అవకాశం అనుకుని పాత సినిమాల హక్కులు కొనుక్కొని మరి ఇలా రీ రిలీజ్ లు చేస్తున్నారు.

అయితే, ఇప్పటి వరకు హీరోల పుట్టిన రోజు నాడు ఎదొక పాత సినిమా రీ రిలీజ్ చేసారు. కానీ, ప్రభాస్ కు మాత్రం అలా లేదు. ఒకేసారి నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న.. ఇప్పటికే ఈశ్వర్ మూవీ రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా, ఒక రోజు ముందే మిస్టర్ పర్ఫెక్ట్ రీ రిలీజ్ చేస్తామంటూ ఇంకో పోస్ట్ వచ్చింది. మరో వైపు సలార్ మూవీని హైదరాబాద్ లో స్పెషల్ షోలు వేస్తున్నారు అక్టోబర్ 23న. అలాగే రెబల్ సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

సలార్ హిట్ సినిమానే కదా మళ్ళీ ఎందుకు? రెబల్ ఫ్లాప్ సినిమా అని అందరికీ తెలుసు.. ఇంక రీ రిలీజ్ ఎందుకు ? అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు మేకర్స్ పై విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News