Amit Shah: సాయి గణేశ్ తల్లిదండ్రులకు అమిత్ షా ఫోన్

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2022-04-19 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో BJP కార్యకర్త సాయి గణేష్(Sai Ganesh) ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. సోషల్‌మీడియాలోనూ ప్రభుత్వ విధానాలపై పోస్టులు పెడుతుంటాడు సాయి గణేష్. వచ్చే నెల 4వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా, ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో పొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి పువ్వాడ అజయ్‌పై సీరియస్ కామెంట్స్ చేశారు. అంతేగాక, ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా.. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) స్పందించారు. మంగళవారం సాయి గణేష్ కుటుంబసభ్యులకు అమిషా ఫోన్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సాయి గణేశ్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఇంత పెద్ద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News