Kajol: ఆ వార్తలు చూసి షాక్ అయ్యా.. కాజోల్ ఆసక్తికర కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) ‘దో పత్తి’ సినిమాలో కీలక పాత్రలో నటించింది

Update: 2024-10-27 08:56 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) ‘దో పత్తి’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా కాజోల్(Kajol) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను యాంకర్ మీరు చూసిన వింత వార్తలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. కాజోల్(Kajol) మాట్లాడుతూ..‘‘చాలా ఉన్నాయి. ఏకంగా నేను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. వాటిని చూసి నేను షాకయ్యాను.

ఇలా ఎన్నో సార్లు జరిగింది. దాదాపు ఐదేళ్లకు ఒకసారి ఇలాంటివి వస్తుంటాయి. ఇంటర్నెట్ లేని రోజుల్లో కూడా ఒకసారి గుర్తు తెలియని వ్యక్తి మా అమ్మకు ఫోన్ చేసి విమాన ప్రమాదంలో నేను చనిపోయానని చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకుని మా ఇంట్లో వాళ్ళు కంగారుపడ్డారు. ఇటీవల యూట్యూబ్‌(YouTube)లో నేను మృతి చెందినట్లు వార్తలు కనిపించాయి.

నా గురించి ఎలాంటి వార్తలు వచ్చాయా? ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అని నేను తెలుసుకోను. నాపై ఏదైనా వార్త వస్తే నా స్నేహితులు పంపిస్తారు. వాటిని చదివినప్పుడు ఇలా ఎలా రాస్తారు? నిజాలు తెలుసుకోకుండా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కాజోల్(Kajol) కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News