సీనియర్ యాక్టర్ రమాప్రభ ఇంట తీవ్ర విషాదం..!

సీనియర్‌ యాక్టర్ రమాప్రభ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరి తనయుడు సురేష్‌ ఆకస్మికంగా కన్నుమూశారు.

Update: 2024-10-18 02:03 GMT

దిశ, సినిమా: సీనియర్‌ యాక్టర్ రమాప్రభ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరి తనయుడు సురేష్‌ ఆకస్మికంగా కన్నుమూశారు. ఇటీవల ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాయత్రికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే అస్వస్థతకు గురి కావడంతో బెంగళూరులోని ఓ హాస్పిటల్‌కు సురేష్‌ను తరలించారు. కొన్ని రోజులు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక సురేష్ మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా గత 9 నెలలుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో సురేష్‌ బాధపడుతున్నారని తెలిసింది.

ఇక రమాప్రభ సమర్పణలో రూపొందిన 'అప్పుల అప్పారావు' వంటి సినిమాలకు సురేష్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే మదనపల్లిలో రాజకీయంగా కూడా ఈయన బాగా ఎదిగారు.

Tags:    

Similar News