జనాలు చచ్చేదాకా చోద్యం చూస్తూనే ఉంటా రా...?!

దిశ,- భద్రాచలం : భద్రాచలం పట్టణం పుణ్యక్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది.. Latest Telugu News..

Update: 2022-03-20 09:37 GMT

దిశ,- భద్రాచలం : భద్రాచలం పట్టణం పుణ్యక్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఈ రహదారి అధ్వానంగా ఉంది. ఇటీవల ఇసుక లారీల పుణ్యాన ఈ చర్ల రోడ్డు ఇలా మారింది. అధికారులందరూ నిత్యం ఈ రోడ్డు నుంచి పయనం సాగిస్తుంటారు. ఆర్&బి అధికారులు కూడా నిత్యం ఈ గుంతల రోడ్డు చూస్తూనే ఉన్నారు. అయినా ఏమాత్రం వారిలో చలనం లేదు. ప్రతిరోజు ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సంబంధిత శాఖ అధికారుల వైఖరి చూస్తూ ఉంటే.. జనాలు సచ్చేదాక చలనం ఉండదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ ప్రమాదకరమైన రహదారి సం"గతి" ఆలోచించాలని పుణ్యక్షేత్ర వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Tags:    

Similar News