pranitha Subhash: ఇద్దరు పిల్లలతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన పవర్ స్టార్ బ్యూటీ

టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-15 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బావ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రభస సినిమాలో నటించింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది మూవీలో నటించి.. బాపు బొమ్మగా తెలుగు ప్రజల్ని కట్టిపడేసింది. తన నటన, అందం, అభినయం, బొంగరల్లాంటి కళ్లతో యువత గుండెల్ని కొల్లగొట్టిందనడంలో అతిశక్తిలేదు.

ఇక కెరీర్‌లో ఎదిగే సమయంలో ఈ బ్యూటీ వ్యాపారవేత్త అయిన నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. ప్రణీత-నితిన్‌కు 2022 లో పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. రీసెంట్‌గానే ఈ పవన్ కల్యాణ్ బ్యూటీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ప్రణీత సుభాష్ తన ఇద్దరి పిల్లలతో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకుంది. పిల్లలిద్దర్ని సంప్రదాయంగా రెడీ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవ్వగా ఫ్యాన్స్ క్యూట్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ప్రణీత తనకు సంబంధించిన.. తన పిల్లలకు సంబంధించిన అప్డేట్స్ గానీ, ఫొటోలు గానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది. వివాహనంతరం చీర కట్టులో అదిరిపోయే ఫొటోషూట్లు చేసి యువతను మంత్రముగ్దుల్ని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ సినిమాలకు దూరంగా ఉంటూ భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రణీత పంచుకున్న క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Full View


Similar News