ఎంపీ అర్వింద్​పై నాన్​ బెయిలబుల్ ​కేసు

దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. latest telugu news..

Update: 2022-03-24 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టులో కేసు విచారణకు హాజరు కాలేదని ఎంపీ అర్వింద్‌కు వారెంట్‌ జారీ అయింది. 2020 నవంబర్‌ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పీఎస్‌లో అర్వింద్‌పై ఈ కేసు నమోదైంది. కాగా తదుపరి కేసు విచారణను ఈ నెల 28కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News