"చచ్చిపోతాను అని చెప్పినా కూడా నా భార్య పట్టించుకోలేదు".. ఐకాన్ స్టార్ సంచలన కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-16 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ‘గంగోత్రి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో బన్నీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను అందుకుంటూ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2’లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఇద్దరు యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు (అల్లు అర్హ, అల్లు అయాన్). అల్లు అర్హ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్‌గా కూడా నటించేసింది . కాగా ఎంతో అన్యోన్యంగా ఉండే స్నేహ రెడ్డి - అల్లు అర్జున్‌ల మధ్య జరిగిన ఒక సంభాషణ‌కి సంబంధించిన విషయాన్ని బన్నీ ఓపెన్‌గా చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే..

గతంలో "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ తన భార్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగ్ టైం‌లో నేను సరదాగా స్నేహ రెడ్డికి కాల్ చేసి .."నన్ను నిజంగానే ఆర్మీలో జాయిన్ అవ్వమంటున్నారు ..జాయిన్ అవ్వనా అంటూ అడిగాను. అయితే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా స్నేహారెడ్డి ఓకే జాయిన్ అవ్వమని చెప్పింది. ఒకవేళ నాకు ఏదైనా అయితే ..చచ్చిపోతే.. అని నేను అడిగితే.. "పోతే పో ఇండియా కోసమేగా ప్రాణమిస్తున్నావ్ నో ప్రాబ్లం.. పిల్లల్ని నేను చూసుకుంటాను" అంటూ స్నేహా రెడ్డి ఓపెన్‌గా చెప్పేసింది. ఇది విని అక్కడే ఉన్న డైరెక్టర్ సినిమా టీమ్ మెంబర్స్ అందరూ షాక్ అయిపోయారు” అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News