ఆ పని చేయడం నచ్చక నటననే వదిలేయానుకున్నా.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-21 03:50 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్, డీ గ్లామర్.. ఇలా పాత్ర ఏదైనా సరే అవలీలగా నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ‘కరణ్ అర్జున్’, ‘కుఛ్ హోతా హై’, ‘దిల్‌వాల్ దుల్హానియా లే జాయేంగే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ అందుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న ఈ అందాల భామ.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఈ బ్యూటీ ఒకానొక సమయంలో సినిమాలకు దూరం కావాలనుకున్నదట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “‘ఉధార్ కీ జిందగీ’ నా మూడో సినిమా. అప్పుడు నాకు 18 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. అప్పుడే సినీ ఇండస్ట్రీకి వచ్చిన నాకు అంతా కొత్తగా ఉంది. మేకప్, గ్లిజరిన్ వేసుకోని ఏడ్వడం.. ఇవన్నీ చూసి నటనతో విసిగిపోయాను. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాక నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇక నటించడం నా వల్ల కాదని మా అమ్మకు చెప్పేశా. కానీ, షారుక్ నన్ను నా వృత్తిలో కొనసాగేందుకు ప్రోత్సహించారు. ‘నీకు అన్ని తెలుసు. ఇంకా నటించడం నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటావు’ అని అన్నారు. ఆయన మాటలతో నేను కొంత ధైర్యాన్ని తెచ్చుకొని యాక్టింగ్‌లో, టెక్నిక్‌లను నేర్చుకున్నాను” అని కాజోల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘దో పత్తి’. ఈ మూవీ అక్టోబర్ 25న థియేటర్లలోకి రానుంది.


Similar News