టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసు : విచారణ వాయిదా

టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసు విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 17కు వాయిదా వేసింది.

Update: 2024-10-21 06:36 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితుల పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురు ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ పై జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అసహనుద్దీన్ అమానుల్లాహ్ ధర్మాసనం విచారణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు రీ జాయిండర్ దాఖలు చేస్తామని, అందుకోసం తమకు కాస్త సమయం కావాలని నిందితుల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో కేసు విచారణను డిసెంబర్ 17కు వాయిదా వేసింది. అప్పటి వరకూ నిందితులకు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉపశమనం కొనసాగుతుందని పేర్కొంది.

కాగా.. ఈ కేసులో సెప్టెంబర్ 13న సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నవారంతా.. తమ పాస్ పోర్టులను వెంటనే దర్యాప్తు అధికారికి అందించాలని ఆదేశించింది. నిందితులు విచారణకు సహకరించినంతవరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. 


Similar News