Diwali: లక్ష్మి బాంబ్ Vs అను బాంబ్.. ఈ దీపావళికి మోత మోగాల్సిందే

పండుగ ఏదైన బుల్లితెర (television) సెలబ్రిటీలు పలు ఈవెంట్స్ (Events) కండక్ట్ చేసి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైమ్మెంట్ (Entertainment)ను ఇస్తారు.

Update: 2024-10-20 15:25 GMT

దిశ, సినిమా: పండుగ ఏదైన బుల్లితెర (television) సెలబ్రిటీలు పలు ఈవెంట్స్ (Events) కండక్ట్ చేసి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైమ్మెంట్ (Entertainment)ను ఇస్తారు. ఈ క్రమంలోనే ఈటీవీ (ETV) చానెల్ ఈ దీపావళి (Diwali) స్పెషల్‌గా మరో కొత్త షోతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి కాగా.. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో (promo)ను రిలీజ్ చేశారు.

దీపావళి (Diwali) టపాసులతో స్టార్ట్ అయిన ఈ ప్రోమో (promo).. సెలబ్రిటీల సందడితో మరింత పండుగా వాతావరణాన్ని నింపింది. ఇక ఈ ఫోగ్రమ్‌కు ‘దీపావళికి మోతమోగిపోద్ది’ అనే టైటిల్ పెట్టగా.. యాంకర్‌గా శ్రీముఖి (Srimukhi) వ్యవహరిస్తోంది. అలాగే.. స్పెషల్ జడ్జ్‌లుగా మంచు లక్ష్మి (Manchu Lakshmi), యాంకర్ అనసూయ (Anasuya) వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. అలాగే వీరిద్దరి మధ్య లక్ష్మి బాంబ్ Vs అను బాంబ్ మధ్య ఫైట్ ఉన్నట్లు కట్ చేశారు ప్రోమో (promo). ఇక ఈ దీవాళి (Diwali) స్పెషల్ ఈవెంట్‌కు పలువురు బుల్లితెర సెలబ్రిటీలతో పాటు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు. ప్రజెంట్ ఈ ప్రోమో (promo) నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.


Similar News