వివేకానంద హత్యలో జగన్ పాత్ర ఉంది : యనమల రామకృష్ణుడు

దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక నేరపూరితమైన కుట్ర ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు,

Update: 2022-03-05 10:28 GMT

దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక నేరపూరితమైన కుట్ర ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 120 బి ప్రకారం సీఎం జగన్  కూడా ఈ హత్యలో ముఖ్య భాగస్వామి అనేది సాక్షుల వాంగ్మూలాలను బట్టి స్పష్టంగా అర్ధమౌతోందని ఆరోపించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , జగన్ రెడ్డి అంతా క్రిమినల్ కాన్పిరెన్స్ గా ఏర్పడి వివేకాను హత్య చేశారని, సీబీఐ దర్యాప్తును బట్టి అర్ధమౌతోందన్నారు. 'వివేకా హత్య వెనుక ఎవరున్నారో వివేకా కూతురు, అల్లుడు ఇతర కుటుంబ సభ్యులంతా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్టు) ప్రకారం వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి పాత్ర ఉందనటానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్‌రెడ్డితో పాటు జగన్ రెడ్డి పేరు కూడా ఎఫ్ఐర్, చార్జిషీట్‌లో చేర్చాలి' అని యనమల డిమాండ్ చేశారు.

రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంట్‌కు ఉంది

'రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉంది. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉంది గానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా వెల్లడించింది. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదు. రాజధానిపై సీఎం వైఎస్ జగన్ మూర్ఖంగా మరో చట్టం చేసినా ఇదే పరిస్ధితి ఎదురవుతుంది. జగన్ రెడ్డి ఇకనైనా హైకోర్టు తీర్పును, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలి. అలా కాకుండా మూర్కపు వైఖరితో అమరావతిని నిర్లక్ష్యం చేస్తే హైకోర్టు తీర్పును కించపరిచినట్లే అవుతుందని యనమల హెచ్చరించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో వైసీపీకి తెలియదు

చట్టసభల్లో తమకు బలముందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదని విమర్శించారు. 'అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. బడ్జెట్‌ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలి. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలి. మాట్లాడితే అభివృద్ది వికేంద్రకరణ అని కబుర్లు చెబుతున్నారు. కానీ వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది చేశారో ఏఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ నుంచి ఐటీ కంపెనీలు పరిశ్రమలు తరలిపోయాయి. కర్నూలులో సోలార్ ప్లాంట్ ఆగిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. దేశం మొత్తానికి ఒకే రాజధానిగా ఢిల్లీ ఉంది అన్ని రాష్ట్రాలు అభివృద్ది చెందుతున్నాయి. డిల్లీని 4 ముక్కలు చేసి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని విభజించలేదు. అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని, అలానే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి. అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడే ప్రతి జిల్లాకు ఏం చేయాలో అసెంబ్లీలో చెప్పాం. కానీ వైసీపీ పాలనలో ఏ జిల్లాలో అభివృద్ది జరగలేదు. రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడింది. పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందుతుటే ఏపీ మాత్రం అభివృద్దిలో అట్టడుగుకు చేరింది'అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Tags:    

Similar News