ఆరోజే అమిత్ షా చేతుల మీదుగా మేనిఫెస్టో: కిషన్ రెడ్డి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘటన విజయం సాధిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Update: 2023-11-16 11:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘటన విజయం సాధిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 18వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్ లో కార్యకర్తల బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీ మేనిఫెస్టోలో ప్రజలకు మేలు చేసే పలు హామీలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎల్లుండి గద్వాల్, నల్గొండ, వరంగల్ జిల్లాలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.

Tags:    

Similar News