గాదరి కిషోర్‌కు బిగ్ షాక్.. పద్మకు ప్రగతి భవన్ నుంచి పిలుపు!

సూర్యాపేట ఐసీడీఎస్ జ్యోతి పద్మకు ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

Update: 2023-09-19 08:11 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట ఐసీడీఎస్ జ్యోతి పద్మకు ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందనుంది. ఈ బిల్లు అమల్లోకి రావడంతో తుంగతుర్తి నియోజకవర్గం మహిళలకు కేటాయించనుందని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే పద్మకు పిలుపు వచ్చినట్లు సమాచారం. మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి.. ఆయన ద్వారా సీఎం కేసీఆర్‌ను కలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సతీమణి బీసీ కావడంతో ఆయనకు అవకాశం లేకుండా పోయింది.


Similar News