మేడిగడ్డ ఘటనపై స్పందించని బీజేపీ అగ్రనేతలు

తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్నది. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై బీజేపీ అగ్రనేతలు స్పందించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Update: 2023-11-18 14:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్నది. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై బీజేపీ అగ్రనేతలు స్పందించకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వచ్చినా కాళేశ్వరం ఘటనపై స్పందించలేదు. తాజాగా శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గద్వాల, నల్గొండ, వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలలో ప్రసంగించారు. ఈ మూడు చోట్ల కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారే తప్ప ప్రాజెక్టు కుంగడం గురించి మాట్లాడకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని అందువల్లే బీజేపీ అగ్రనేతలు మేడిగడ్డ, అన్నారం ఘటనల ఊసైనా ఎత్తకుంటా కాళేశ్వరం అవినీతిపై నామమాత్రంగా విమర్శలు చేస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News